యేసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు?

లూకా 23:43లో యేసు ఇలా చెప్పాడు, “నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు.” అయితే 1 పేతురు 3:19, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. యేసు మరణించిన తరువాత తన అవరోహణలో రక్షకుడు ఏమి చేశాడో 19వ వచనం చెప్తూవుంది.

బైబిల్ నిజమని మనకు నిశ్చయముగా తెలుసు. కాని యేసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు? ఈ రెండు స్టేట్మెంట్స్ విభిన్నముగా ఉన్నాయి.

సిలువపై, యేసు పశ్చాత్తాపపడిన దొంగతో: నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను, లూకా 23:43. మరణ సమయంలో, శరీరం మరియు ఆత్మ విడిపోతాయి. యేసు గుడ్ ఫ్రైడే నాడు మరణించినప్పుడు, పశ్చాత్తాపపడిన దొంగ యొక్క శరీరం ఆత్మ వలె ఆయన శరీరం ఆత్మ విడిపోయాయి. వారి శరీరాలు భూమిపైనే ఉన్నాయి, వారి ఆత్మలు పరదైసులోకి ప్రవేశించాయి. యేసు తన మరణానికి ముందు, తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను, లూకా 23:46, అని పలికిన మాటలను గుర్తుచేసుకోండి.

పశ్చాత్తాపపడిన దొంగ శరీరం భూమ్మీద ఉంది. అతని ఆత్మ పరలోకంలో ఉంది. యేసు శరీరం ఆత్మ “మూడవ రోజున” తిరిగి కలిశాయి. అపొస్తలుల కార్యములు 2:31, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. అనేక సార్లు యేసు చెప్పాడు, ఉదాహరణకు, మత్తయి 16:21లో, అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధానయాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. మత్తయి 17:23, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.

యేసు ఈస్టర్ ఆదివారం ఉదయం భూమిపై ప్రజలకు కనిపించడానికి ముందు, పాపంపై, సాతానుపై మరణంపై తన విజయాన్ని ప్రకటించడానికి తన శరీరం ఆత్మతో నరకంలోకి దిగాడు. 1 పేతురు 3:18-20, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను.

ఆయన శరీరంలో చంపబడ్డాడు కానీ ఆత్మలో బ్రతికించబడ్డాడు, దాని ద్వారా ఆయన ఆత్మరూపిగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్లి వారికి ప్రకటించాడు. ఇది క్రీస్తు పునరుత్థానానికి ముందు జరిగిందని ఆయన ఆత్మలో అవరోహణమయ్యాడని (నరకంలోకి వెళ్లాడని) చెప్తుంది. క్రీస్తు పునరుత్థానం మరియు నరకంలోకి దిగడంలో పరిశుద్ధాత్మ పూర్తిగా పాల్గొన్నాడనేది ముఖ్య విషయం.

ఆత్మరూపిగా అనే మాట ఆయన మహిమాన్విత స్థితిని సూచిస్తుంది. ఈ మహిమాన్వితమైన ఉనికిలో, ఆయన వెళ్లి “చెరలో ఉన్న ఆత్మలకు బోధించాడు.” ఇది ఒక ప్రత్యేక పద్ధతి లేదా ఆపరేషన్ ద్వారా కాకుండా, స్థానికంగా నిజమైన ప్రదేశానికి వెళ్లిన ఒక చర్య. ఆ ప్రదేశం ఆత్మల “చెర”, అంటే నరకం (మత్తయి 5:25; 1 పేతురు 2:20). “చెర” అంటే అవిశ్వాసానికి ప్రతిఫలంగా దీనిని స్వీకరించే శాపగ్రస్తుల శాశ్వత నివాసం తప్ప మరొకటి కాదు (మార్కు 16:16).

ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాడు. ఏ విషయాన్ని ప్రకటించాడు? మరణం తర్వాత, ఎట్టి పరిస్థితుల్లోనూ, దేవుని వాక్యం రెండవ అవకాశాన్ని అనుమతించదు (మార్కు 16:16; హెబ్రీ. 9:27; లూకా 16:19-31). కాబట్టి ఇక్కడ చెరలో ఉన్న ఆత్మలకు క్రీస్తు ద్వారా విమోచనను (సువార్తను) ప్రకటించడానికి ఆయన నరకం లోనికి వెళ్ళలేదు. నరకంలోకి దిగడం అది క్రీస్తు బాధలో భాగం కాదు. ఆయన నిజంగా నరకం యొక్క భయానకతను నిర్జనత్వాన్ని అనుభవించాడు, కాని అది సిలువపై జరిగింది. ఈ విషయంపై వెలుగునిచ్చే మరో భాగం కొలొస్సయులు 2:15, ఇక్కడ పౌలు మన రక్షకుడు మరణం, నరకం యొక్క శక్తులను బహిరంగంగా సిగ్గుపరచాడని చెప్తున్నాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, తన విజయోత్సవ ఊరేగింపులో బహిరంగంగా ప్రదర్శించాడు. వారు బహిరంగంగా సిగ్గుపడునట్లు చేసి, సిలువ చేత వారిపై విజయాన్ని ప్రకటించాడని చెప్తున్నాడు. దేవుని మరియు మానవుని యొక్క ఓడిపోయిన శత్రువులను తన ముందు ఊరేగిస్తూ పురాతన పద్ధతిలో ఆయన విజయం సాధించాడు. ఆయన ఆత్మలో నరకానికి వెళ్లి చెరలో ఉన్న అవిశ్వాసులకు మరియు సాతాను వారి అనుచరులకు ఇద్దరికీ తన విజయాన్ని ప్రకటించాడు. యేసు విజయ సైన్యాధిపతులు తరచుగా చేసే విధంగానే చేశాడు – శత్రువు రాజధానికి వెళ్లి విజేత జెండాను ఎగురవేశాడు. యేసు తన విజయాన్ని ప్రకటించడం కోసం ఆయన నరకానికి వెళ్ళాడు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl